Friday, November 29, 2019

గీతా జయంతి

గీతా జయంతి...
సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్


గీత ఎప్పుడు పుట్టింది?

భారతదేశ చరిత్రలో మహాభారత యుధ్ధం ఒక ప్రధానమైన సంఘటన. మహా భారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్స రాలకు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది!!

అంటే క్రీస్తు పూర్వము 3,102, ఫిబ్రవరి 18న కలియుగం ఆరంభమైనదని చరిత్ర చెబుతుంది.

మహాభారత యుధ్ధము "కురుక్షేత్రము"లో 18 రోజులు జరిగింది!!

కార్తీక అమావాస్య రోజు మహభారత యుద్ధం ప్రారంభమైనది!! 10 రోజులు భీష్ముడు రణం చేసి పదవ రోజున నేలకొరిగాడు!!

11వ రోజున అంటె మార్గశిర శుధ్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభలో దృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు చెబుతూ భగవద్గీతను చెప్పాడు!! ఆవిధంగా మొదటి సారి హస్తినాపురములోని సభలో వున్నవారందరూ దృతరాష్ట్ర మహారాజుతో పాటు పురజనులు కూడా విన్నారు!!

కార్తీక అమావాస్యరోజు సూర్యోదయ వేళ యుద్ధము ప్రారంభానికి ముందు అపారమైన కురు - పాండవ సేనావాహినుల మధ్యన రథముపై చతికిలబడి నిరాశా నిస్పృహలతో విషాధముతో బాధపడుతున్న అర్జునుని నిమిత్త మాతృనిగా చేసుకుని శ్రీకృష్ణ భగవానుడు మనందరికి భగవద్గీతను బోధించాడు!!

లోకానికి అందినది మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అందుకే మనం ఈరోజు "గీతాజయంతి" ని జరుపుకుంటాం!!

మనం ఇంత వరకు వ్యక్తుల జన్మదినం జరుపుకుంటున్నాము.  జ్ఞాన ప్రధాయిని అయిన ఒక గ్రంథానికి జయంతి జరపటం అనేది అధ్భుతమైన విషయం!!

లక్ష శ్లోకాల మహాభారత గ్రంథంలో భీష్మ పర్వంలో 24 నుండి 41వరకు 18 అధ్యాయాలుగా వున్న భాగమే "భగవద్గీత"!!

కలియుగం ప్రారంభమై 2019 నాటికి 5121 సంవత్సరాలు గడిచాయి!! దీనికి 36 సం.రాలు కలిపితె 5157 సంవత్సరాలు!! ఇప్పుడు మనం 5158 వ గీతాజయంతిని జరుపు కుంటున్నాము!!

కృష్ణం వందే జగద్గురుమ్.

గీతా జయంతి శుభాకాంక్షలతో...
మీ
గోగులపాటి కృష్ణమోహన్

No comments:

Post a Comment